కోల్కతా, డిసెంబర్ 31: పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే పోలీసులకు బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేశారు. పద్ధతి మార్చుకోకపోతే పోలీస్ స్టేషన్ను తగలబెడుతానని హెచ్చరించారు. బన్గావ్ సౌత్ నియోజకవర్గ ఎమ్మెల్యే స్వపన్ మజుందర్ బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘అశోక్నగర్ పోలీసులు బీజేపీ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నారు. అరెస్టులు చేస్తున్నారు. తృణమూల్ కార్యకర్తల అక్రమాలను అనుమతిస్తున్నారు. మా కార్యకర్తపై దాడిచేసిన తృణమూల్ కార్యకర్తలను అరెస్టు చేయలేదు. తృణమూల్కు ఏజెంట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఈ పద్ధతిని మార్చుకోకపోతే ఏదో ఒకరోజు పోలీస్ స్టేషన్ను తగలబెడతాం’ అంటూ ఎమ్మెల్యే హెచ్చరించారు.