పుణె : టీమిండియా రెండవ వన్డేలో నిదానంగా బ్యాటింగ్ చేస్తోంది. ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో.. 15 ఓవర్లలో ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 66 రన్స్ చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు ఔటయ్యారు. రోహిత్ 25, ధావన్ 4 పరుగులు చేసి నిష్క్రమించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ(23), కేఎల్ రాహుల్(11)లు క్రీజ్లో ఉన్నారు.