యూరప్ పర్యటన నుంచి తిరిగి రాగానే.. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. దేశంలో పెరుగుతున్న ఎండల తీవ్రత, అకాల వర్షాలపై మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు ధ్రువీకరించారు.
దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి? ప్రజలకు ఏ రకమైన జాగ్రత్తలు సూచించాలి? అన్న దానిపై ప్రధాని ఉన్నతాధికారులో చర్చించనున్నారు. ఇక అకాల వర్షాలపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు.