PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాజ్యసభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై మరోసారి తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీని స్టార్టప్గా కాంగ్రెస్ పార్టీ ప్రయోగిస్తే ఆయన నాన్-స్టార్టర్గా మారారని మోదీ ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు మోదీ పెద్దల సభలో బదులిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
విపక్ష పార్టీకి దేశంలో కాలం చేల్లిందని, రిజర్వేషన్లను ఆ పార్టీ నిత్యం వ్యతిరేకిస్తుందని దుయ్యబట్టారు. ఆ పార్టీ పతనం పట్ల తాము సంతోషంగా లేమని, ఆ పార్టీ దుస్ధితిపై తాము సానుభూతి తెలుపుతున్నామని మోదీ పేర్కొన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని కాలరాసిందని, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసిందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ దళితులు, బీసీలు, ఆదివాసీలకు వ్యతిరేకమని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో సుదీర్ఘంగా ప్రసంగించడం పట్ల తాను ఆశ్చర్యపోయానని అన్నారు. అంతసేపు మాట్లాడే స్వేచ్ఛ ఖర్గేకు ఎలా వచ్చిందని తాను ఆశ్చర్యపోయానని మోదీ విస్మయం వ్యక్తం చేశారు. సాధారణంగా ఇక్కడే ఉండే ఇద్దరు కమాండోలు, అంపైర్ల గైర్హాజరుతో ఖర్గే ఫోర్లు, సిక్సర్లతో చెలరేగారని వ్యాఖ్యానించారు.
Read More :
Gas subsidy | రూ.500కే గ్యాస్ అమలుకు మూడు ప్రతిపాదనలు.. విధివిధానాల తయారీపై కసరత్తు !