PM Modi : కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరమేనని ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. ప్రజల ఆస్తులను లాగేసుకుని వాటిని ఎంపిక చేసిన కొందరికి కట్టబెట్టేందుకు కాంగ్రెస్ నేతలు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. రాజస్ధాన్లోని సవోయి మాధోపుర్లో మంగళవారం జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాజస్ధాన్లో కాంగ్రెస్ పార్టీ శ్రీరామ నవమి వేడుకలను నిషేధించిందని ప్రధాని పేర్కొన్నారు. రాజస్ధాన్లో తొలిసారిగా ఈసారి రామనవమి సందర్భంగా శోభాయాత్ర జరిగిందని ఆయన గుర్తుచేశారు. ప్రజలు రామ శబ్ధాన్ని ఆలపించే రాజస్దాన్ వంటి రాష్ట్రంలో కాంగ్రెస్ రామనవమిని నిషేధించిందని అన్నారు.
రాజస్థాన్లోని బన్స్వారాలో ఆదివారం జరిగిన ర్యాలీలో తాను చేసిన ‘సంపద పునఃపంపిణీ’ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్, విపక్ష ఇండియా కూటమికి ఈ వ్యాఖ్యలు ఆగ్రహం కలిగించాయని, అందుకే వారు ప్రతిచోటా మోదీని తిడుతున్నారని అన్నారు. ప్రజల ఆస్తులపై సర్వే చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పొందుపరిచిందని, ఆస్తుల ఎక్స్రే చేపడతామని వారి నేత చెప్పారని మోదీ గుర్తుచేశారు. మోదీ వారి బండారాన్ని బట్టబయలు చేయడంతో వారి రహస్య అజెండా బయటపడి భయంతో వణికిపోతున్నారని అన్నారు.
Read More :
Konda Vishweshwar Reddy | చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆస్తి ఎంతో తెలుసా..?