న్యూఢిల్లీ: దేశంలో ఉమ్మడి పౌరస్మృతి(Uniform Civil Code)ని అమలు చేయాలని, కానీ ప్రతిపక్షాలు దాన్ని అడ్డుకుంటున్నట్లు ప్రధాని మోదీ ఆరోపించిన విషయం తెలిసిందే. భోపాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. ఇది దేశ బహుళత్వం, వైవిద్యాన్ని అటాక్ చేయడమే అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రధాని మోదీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నట్లు కాంగ్రెస్, డీఎంకే, ఏఐఎంఐఎం పార్టీలు ఆరోపించాయి.
మణిపూర్లో జరుగుతున్న హింస గురించి ప్రధాని ఏమీ మాట్లాడలేదని, ధరల పెరుగుదల, నిరుద్యోగం గురించి ఎటువంటి మాట చెప్పలేదని, కానీ యూసీసీ అమలు గురించి ఆయన ప్రస్తావించడం సరైందికాదు అని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. ఉమ్మడి పౌరస్మృతిపై ముస్లిం వర్గాన్ని ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని ప్రధాని తన ప్రసంగంలో ఆరోపించారు. ప్రజలకు రెండు రకాల రూల్స్ ఉంటే ఒక కుటుంబం ఎలా పనిచేస్తుందని, అప్పుడు దేశం ఎలా పనిచేస్తుందని ఆయన ప్రశ్నించారు.
#WATCH | PM Narendra Modi speaks on the Uniform Civil Code (UCC)
"Today people are being instigated in the name of UCC. How can the country run on two (laws)? The Constitution also talks of equal rights…Supreme Court has also asked to implement UCC. These (Opposition) people… pic.twitter.com/UwOxuSyGvD
— ANI (@ANI) June 27, 2023
ఒకవేళ ఉమ్మడి పౌరస్మృతి కావాలంటే దాన్ని పార్లమెంట్లో బీజేపీ ప్రవేశపెట్టవచ్చు అని, వాళ్లను ఎవరు అడ్డుకున్నారని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ తెలిపారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వమే ఉందని, పార్లమెంట్లో యూసీసీ ప్రవేశపెట్టకుండా, ప్రతిపక్షాలపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. యూసీసీ పేరుతో కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్షాలపై అబాండాలు మోపరాదు అని అధిర్ రంజన్ చౌదరి అన్నారు.
#WATCH | If they (BJP) wish they may bring Uniform Civil Code (UCC) in the form of legislation in the Parliament. Who has stopped them? It is their government. Before placing it in Parliament why are you raising the issue and putting the blame on the opposition party? In the name… pic.twitter.com/ZIiiEosMOB
— ANI (@ANI) June 28, 2023
భారత్లో ఉన్న బహుళత్వాన్ని, భిన్నత్వాన్ని ప్రధాని మోదీ సమస్యగా చూస్తున్నారని, యూసీసీ పేరుతో దేశానికి ఉన్న ఔనత్యాన్ని తగ్గిస్తారా అని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. యూసీసీ గురించి మాట్లాడుతున్నారంటే.. అప్పుడు హిందూ సివిల్ కోడ్ గురించి కూడా మాట్లాడాల్సిందే అని, హిందూ అవిభాజ్య చట్టాన్ని ఆయన రద్దు చేస్తారా అని ఓవైసీ ఛాలెంజ్ విసిరారు. పంజాబ్కు వెళ్లి యూసీసీ గురించి సిక్కులకు చెప్పండి అని, అప్పుడు వాళ్లు రియాక్షన్ ఏంటో తెలుస్తుందని ఓవైసీ అన్నారు.
#WATCH | AIMIM chief Asaduddin Owaisi speaks on PM Modi's statement on Uniform Civil Code in Bhopal; says, "India's PM considers India's diversity & its pluralism a problem. So, he says such things…Will you strip the country of its pluralism & diversity in the name of a UCC?…… pic.twitter.com/XeBhdBDycD
— ANI (@ANI) June 27, 2023
హిందూ మతంలో ముందుగా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని, దేశంలోని ప్రతి ఆలయంలో ఎస్టీలు, ఎస్సీలు పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని, యూసీసీ తమకు అవసరం లేదని, ఎందుకంటే రాజ్యాంగం ప్రతి మతానికి రక్షణ ఇచ్చిందని డీఎంకే నేత టీకేఎస్ ఇళంగోవన్ తెలిపారు.