న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినా, గోవా ఎన్నికలకు నిధులు ఖర్చు చేసినట్టు రుజువులు, ధ్రువీకరణ లేకపోయినా, ఒక్క రూపాయి కూడా స్వాధీనం చేసుకోకపోయినా ఈడీ తనను అరెస్ట్ చేసిందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ కేసులో ఈడీ తనతో చాలా దురుసుగా వ్యవహరించిందని శనివారం సుప్రీంకోర్టుకు తెలిపారు.
తనను ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై ఈడీ రిైప్లె అఫిడవిట్కు కేజ్రీవాల్ సమాధానాన్ని దాఖలు చేశారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు తనను అరెస్ట్ చేయడం చూస్తే ఈడీ ఏకపక్ష ధోరణి అర్థమవుతుందన్నారు. మరోవైపు కేజ్రీవాల్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని ఎయిమ్స్ వైద్యుల మెడికల్ బోర్డు నివేదిక ఇచ్చింది.