భువనగిరి అర్బన్, ఏప్రిల్ 27: బీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలతో సీఎంగా కేసీఆర్ రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారని బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం భువనగిరిలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో గులాబీ జెండాను ఆయన ఎగుర వేశారు. అనంతరం స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్యామ మల్లేశ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీనే ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.
గులాబీ పార్టీతోనే రాష్ట్రం అన్ని రంగాలలో ముందంజలో ఉందని తెలిపారు. బీఆర్ఎస్ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలు లబ్ధిపొందిన తీరును విస్తృతంగా ప్రచారం చేయాలని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక ఓట్లు వేసేలా చూడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలన్నా, ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నా అది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్తోనే సాధ్యమవుతుందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందంజలో ఉంచుతానని తెలిపారు.
సమస్యలతో కొట్టుమిట్టాడిన భువనగిరి నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి చెందిందని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. రాజధానికి అతి చేరువలో ఉన్న భువనగిరి ప్రాంతం గత పాలకుల చేతుల్లో కనీసం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో భువనగిరి ప్రధాన రహదారి వెడల్పుతోపాటు పెద్ద చెరువును మినీ ట్యాంక్బండ్గా తీర్చిదిద్దామని తెలిపారు. పట్టణాన్ని అన్ని విధాలుగా సుందరంగా మార్చామని చెప్పారు.
ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టితో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జిల్లా జడల అమరేందర్గౌడ్, కొలుపుల అమరేందర్, ఎడ్ల రాజేందర్రెడ్డి, ఎన్నబోయిన ఆంజనేయులు, చింతల కిష్టయ్య, పట్టణ, మండలాధ్యక్షులు ఏవీ కిరణ్కుమార్, జనగాం పాండు, ప్రధాన కార్యదర్శులు రచ్చ శ్రీనివాస్రెడ్డి, నీల ఓంప్రకాశ్గౌడ్, పట్టణ నాయకులు అబ్బగాని వెంకట్, చెన్న మహేశ్, పోల ప్రవీణ్గౌడ్, నాగారం సూరజ్ తదితరులు పాల్గొన్నారు.