చేవెళ్లటౌన్, ఏప్రిల్ 27 : బీసీ నేత, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని రంగారెడ్డి డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్ ప్రజలను కోరారు. శనివారం చేవెళ్ల మండల పరిధిలోని ధర్మాసాగర్, గొల్లపల్లి, రావులపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయామని ప్రజలు బాధపడుతున్నారని, కేసీఆర్ పాలనలోనే తమకు న్యాయం జరిగిందని ప్రజలు అంటున్నారని తెలిపారు.
కేసీఆర్ హయాంలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు పేద ప్రజకు అందాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పినా.. అధికారంలోకి వచ్చి ప్రజలకు మొండిచేయి చూపించిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కూడా పూర్తి స్థాయిలో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, ప్రతి పంటకు క్వింటాలుకు రూ.500ల బోనస్, రైతు భరోసా కింద సంవత్సరానికి ఎకరాకు రూ.15వేల పెట్టుబడి సాయం,
వృద్ధులు, వితంతవులు, ఒంటరి మహిళలకు 2వేల నుంచి రూ.4వేలకు పెంపు, వ్యవసాయ కూలీలకు రూ.12వేలు, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు చేయూత వంటి పథకాలను అమలు చేయలేదన్నారు. లోక్సభ ఎన్నికల్లో మరోసారి లబ్ధి పొందేందుకు రూ.2లక్షల రుణమాఫీ ఆగస్టు 15 వరకు అమలు చేస్తామంటూ అబద్ధాలు చెబుతున్నదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు జరిగేంత వరకు ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్రంలో 4లక్షల మందికి పోడు పట్టాలిచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులు దేశానికే అదర్శంగా నిలిచాయని వారు పేర్కొన్నారు.
కార్యక్రమంలో చేవెళ్ల అసెంబ్లీ యూత్ అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింటు, చేవెళ్ల మండల మాజీ సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు శివారెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు శేఖర్, మాజీ సర్పంచ్లు శ్రీనివాస్, అంజయ్యగౌడ్, శంకర్యాదవ్, గణేశ్, చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నర్సింహులు, బీసీ సెల్ మండల అధ్యక్షుడు రాములు, మాజీ డైరెక్టర్లు మహేశ్, అబ్దుల్ఘనీ, నాయకులు రామాగౌడ్, విఠల్రెడ్డి, రాజు, మహేందర్, రాంప్రసాద్, శ్రీనివాస్, ఫసీ ఉన్నారు.