PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) గురువారం శ్రీనగర్లో పర్యటిస్తున్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని మోదీ కశ్మీర్లోయలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో భాగంగా రూ.6400 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్ట్లను మోదీ ప్రారంభించనున్నారు.
పర్యటనలో భాగంగా శ్రీనగర్ (Srinagar) చేరుకోగానే శంకరాచార్య కొండ (Shankaracharya Hill)ను మోదీ దర్శించుకున్నారు. అక్కడి కొండపై ఉన్న శంకరాచార్య ఆలయాన్ని దూరం నుంచి చూస్తూ నమస్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. దూరం నుంచే ఈ కొండపై ఉన్న శంకరాచార్య ఆలయాన్ని చూసే అవకాశం లభించిందంటూ మోదీ తన పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
మరోవైపు ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్రోన్లు, సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. మోదీ పాల్గొనే సభ వేదిక 2 కిలోమీటర్ల పరిధిలో పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. జీలం నది, దాల్ సరస్సులో మెరైన్ కమాండోలను మొహరించారు.
PM Modi tweets, “Upon reaching Srinagar a short while ago, had the opportunity to see the majestic Shankaracharya Hill from a distance.” pic.twitter.com/sV2PP0iW3h
— ANI (@ANI) March 7, 2024
Also Read..
Bomb Threat | ఢిల్లీ కళాశాలకు బాంబు బెదిరింపులు
Rameshwaram Cafe | బెంగళూరు కేఫ్లో పేలుడు ఘటన.. మాస్క్, క్యాప్ లేకుండా నిందితుడి ఫొటోలు