న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకల సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఢిల్లీలోని శాంతివనం వద్ద కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నెహ్రూకు నివాళులర్పించారు.
భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నివాళులర్పించారు. సత్యం, ఐక్యత, శాంతికి ఎంతో విలువనిచ్చిన నెహ్రూను స్మరించుకుంటున్నాను అని రాహుల్ పేర్కొన్నారు. జవహర్ లాల్ నెహ్రూ 1889, నవంబర్ 12న ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జన్మించారు. 1964, మే 27న మరణించారు. నెహ్రూ పుట్టిన రోజున ప్రతి ఏడాది బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు.