న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ ఉదంతంపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళా రెజ్లర్లు నిరసన చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ తమ మన్ కీ బాత్ను కూడా వినాలని మహిళా రెజ్లర్లు మోదీని కోరారు. తమకు న్యాయం జరిగే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని టోకో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత భజరంగ్ పూనియా స్పష్టం చేశారు.
రెజ్లర్ల డిమాండ్లను పరిశీలించాలని వినేష్ పొఘట్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. తమకు మద్దతుగా కోట్లాది మంది బాసటగా నిలిచారని, తమ సంఘటిత శక్తి అని ప్రధాని మోదీ తమ మన్ కీ బాత్ కూడా వినాలని ఆమె కోరారు. కాగా తనపై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలను బ్రిజ్ భూషణ్ సింగ్ తోసిపుచ్చారు. హర్యానాకు చెందిన 90 శాతం అథ్లెట్లు డబ్ల్యూఎఫ్ఐని విశ్వసిస్తున్నారని, కేవలం కొన్ని కుటుంబాలు, బాలికలు మాత్రమే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
కాగా, మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై టీఎంసీ ఎంపీ మహువ మొయిత్ర మోదీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. కాషాయ భక్షకుల నుంచి మహిళా అథ్లెట్లను ఎందుకు కాపాడటం లేదని ప్రధాని మోదీని ఆమె నిలదీశారు. ఇది మన్ కీ బాత్ కాదని, మౌన్ కీ బాత్ అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఎద్దేవా చేశారు.
Read More