PM Modi : మీరట్లో ఆదివారం మెగా ర్యాలీ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ యూపీలో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మూడోసారి బీజేపీ అధికార పగ్గాలు చేపట్టేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయని, రానున్న ఐడేండ్లలో చేయాల్సిన కార్యక్రమాలపై రోడ్మ్యాప్ తయారుచేస్తున్నామని ప్రధాని వెల్లడించారు. మూడోసారి అధికారంలోకి రాగానే తొలి 100 రోజుల్లో తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలపై కసరత్తు సాగిస్తున్నామని చెప్పారు.
గత పదేండ్లలో మీరు అభివృద్ధికి సంబంధించిన ట్రైలర్ మాత్రమే చూశారని, ఇకపై దేశాన్ని తాము మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళతామని హామీ ఇచ్చారు. 2024 ఎన్నికలు కేవలం ప్రభుత్వం కొలువుతీరేందుకు మాత్రమే కాదని, ఇవి అభివృద్ధి చెందిన భారత్ను ఆవిష్కరించే ఎన్నికలని మోదీ స్పష్టం చేశారు. 2024లో ప్రజలు ఇచ్చే తీర్పు భారత్ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా నిలుపుతుందని అన్నారు.
పదేండ్లుగా భారత్ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని, దేశంలో ఇవాళ ఆధునిక మౌలిక వసతులు వేగంగా నిర్మితమవుతున్నాయని తెలిపారు. ప్రతి రంగంలో యువతకు అపార అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని అన్నారు. మహిళలు ముందడుగు వేస్తూ సత్తా చాటేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు. ఇప్పుడు ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని అన్నారు. పేదల సాధికారత కోసం తమ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్నదని ప్రధాని మోదీ వివరించారు.
Read More :