Loksabha Elections 2024 : ఎస్పీ-కాంగ్రెస్తో కూడిన విపక్ష ఇండియా కూటమి విజయం కోసం పాకిస్తాన్లో ప్రార్ధనలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సరిహద్దు వెలుపల నుంచి విపక్ష కూటమికి జీహాదీలు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం యూపీలోని బన్స్గావ్లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. ఎస్పీ-కాంగ్రెస్ ఓటు జీహాద్కు పిలుపు ఇస్తున్నాయని అన్నారు.
పక్కా గృహాలు పొందనున్న 3 కోట్ల మంది పేదలు, రూ. 5 లక్షల వరకూ ఉచిత చికిత్స అందుకునే వృద్ధులు, ముద్ర పధకంతో రుణాలు పొందే కోట్లాది యువత, స్వయం ఉపాధి గ్రూపులకు చెందిన 3 కోట్ల మంది మహిళలు జూన్ 4న వెల్లడయ్యే తీర్పు కోసం వేచిచూస్తున్నారని మోదీ పేర్కొన్నారు.
Read More :
AP News | స్కూల్ వాట్సాప్ గ్రూప్ చూడట్లేదని టీచర్ సస్పెన్షన్