తిరువనంతపురం : కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాలు మహిళల శక్తిని బలహీనంగా పరిగణించాయని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) విమర్శించారు. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజ్వరేషన్ కల్పిస్తూ తమ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందని చెప్పారు. కేరళ త్రిసూర్లో స్త్రీ శక్తి సంగమం పేరిట బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగసభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
తమ ప్రభుత్వం ముస్లిం మహిళలను బలోపేతం చేసేందుకు ట్రిపుల్ తలాఖ్కు వ్యతిరేకంగా చట్టం తీసుకువచ్చిందని గుర్తుచేశారు. స్వాతంత్ర్యానంతరం కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాలు నారీ శక్తిని తక్కువగా అంచనా వేశాయని, మీ హక్కులను మీకు అందించేందుకు మోదీ గ్యారంటీ కింద చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ను కల్పిస్తూ తమ ప్రభుత్వం చట్టాన్ని తీసుకువచ్చిందని చెప్పారు.
కాంగ్రెస్, లెఫ్ట్ ప్రభుత్వాల హయాంలో ముస్లిం సోదరీమణులు ట్రిపుల్ తలాఖ్తో బాధపడుతుంటే మోదీ గ్యారంటీతో వారికి స్వేచ్ఛ కల్పించామని, చిత్తశుద్ధితో మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చామని చెప్పారు.
Read More :
Kerala Church | మంత్రి కేక్, వైన్ వ్యాఖ్యలపై భగ్గుమన్న కేరళ చర్చ్