Loksabha Elections 2024 : పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) ప్రధాని నరేంద్ర మోదీ సమర్ధించారు. మైనారిటీ శరణార్ధులకు భారత్ ఆశ్రయం కల్పిస్తుందని స్పష్టం చేశారు. ప్రపంచం నేడు పలు సమస్యలతో సతమతమవుతుండగా భారత్ మాత్రం తనకు అసాధ్యమైనది ఏమీ లేదని చాటుతోందని అన్నారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం యూపీలోని పిలిభిత్లో బీజేపీ అభ్యర్ధి జితిన్ ప్రసాదకు మద్దతుగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. లక్ష్యం ఎంత సంక్లిష్టమైనదైనా సాధించాలనే సంకల్పం తీసుకుంటే భారత్ ఆ లక్ష్యాన్ని సాధించి సత్తా చాటుతున్నదని అన్నారు.
ఇవాళ ఇదే స్ఫూర్తి, శక్తితో మనం అభివృద్ధి చెందిన భారత్ను ఆవిష్కరించే దిశగా తీర్మానం తీసుకుని ముందుకు సాగుతున్నామని చెప్పారు. అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ప్రశంసించిన నేతలపై కాంగ్రెస్ బహిష్కరణ వేటు వేస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Read More :
Murder | స్మోక్ చేస్తున్న యువతులను చూసిన యువకుడి హత్య