Murder | నాగ్పూర్ : మహారాష్ట్రలోని నాగ్పూర్, మహాలక్ష్మీ నగర్ ప్రాంతంలో శనివారం దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఓ పాన్ షాపు వద్ద శనివారం రాత్రి ఇద్దరు యువతులు జయశ్రీ, సవిత సిగరెట్లు కాల్చుతున్నారు. ఆ సమయంలో సిగరెట్లు కొనేందుకు అక్కడికి వచ్చిన రంజిత్ రాథోడ్ (28) ఆ యువతులవైపు గుడ్లప్పగించి చూశాడు. దీంతో ముగ్గురి మధ్య గొడవ జరిగింది. రాథోడ్ వీడియో చిత్రీకరించారు.
రాథోడ్ను దూషిస్తూ, ఆయనపైకి జయశ్రీ పొగ వదులుతున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. ఇంతలో ఈ యువతుల్లో ఒకరు తన మిత్రుడు ఆకాశ్కు ఫోన్ చేసి, తక్షణమే రావాలని చెప్పింది. వెంటనే ఆకాశ్ మరికొందరితో కలిసి అక్కడికి వచ్చారు. రాథోడ్ను కత్తితో అనేకసార్లు పొడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, రాథోడ్ను దవాఖానకు తరలించారు. చికిత్స జరుగుతుండగా ఆయన మరణించారు. జయశ్రీ, సవిత, ఆకాశ్లను పోలీసులు అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ను స్వాధీనం చేసుకున్నారు.