PM Modi : 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతూ భారత్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్ధిక వ్యవస్ధల్లో ఒకటిగా నిలిచిందని అన్నారు. గత క్వార్టర్లో భారత్ ఏకంగా 8.4 శాతం వృద్ధి సాధించిందని తాజా గణాంకాలను ఉటంకిస్తూ ప్రధాని పేర్కొన్నారు.
జార్ఖండ్లోని ధన్బాద్లో శుక్రవారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యాల దిశగా వేగవంతమైన వృద్ధిని సాధిస్తూ భారత్ దూసుకువెళుతోందన్నారు. గత పదేండ్లుగా జార్ఖండ్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని, గిరిజనులు, పేదలు, యువత, మహిళల సాధికారత కోసం పనిచేస్తున్నామని వివరించారు.
2047 నాటికి భారత్ను వికసిత్ భారత్గా మలిచేందుకు పాటుపడుతున్నామని చెప్పారు. వికసిత్ భారత్ సాధనకు జార్ఖండ్ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తయారుచేయడం కూడా కీలకమని అన్నారు. జార్ఖండ్ పురోభివృద్ధికి తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
Read More :
Mahesh Babu | ఆసక్తికరంగా మహేశ్ బాబు నయా డెసిషన్.. అభిమానుల్లో జోష్