Loksabha Elections 2024 : రానున్న లోక్సభ ఎన్నికల్లో పాలనలో సామర్ధ్యం కనబరిచిన బీజేపీ మోడల్, విఫలమైన కాంగ్రెస్ మోడల్లో ఏది ఎంచుకుంటారనేది ప్రజలు నిర్ణయించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మలిచేందుకు స్పష్టమైన విజన్తో పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మోదీ సర్కార్ మూడోసారి అధికారంలోకి వస్తే బీజేపీ దేశ రాజ్యాంగాన్ని మార్చేస్తుందని విపక్షాలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. తనకు భారీ ప్రణాళికలు ఉన్నాయని చెబితే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ఎవరినీ భయపెట్టే నిర్ణయాలు తాను తీసుకోనని స్పష్టం చేశారు.
దేశ అభివృద్ధికి బాటలువేసే నిర్ణయాలనే తాను తీసుకుంటానని చెప్పారు. ప్రతి పనినీ సరైన దిశలో తీసుకోవాలని తాను ప్రయత్నిస్తానని అన్నారు. తాను ఇంకా చేయాల్సింది ఎంతోఉందని, దేశ అవసరాలు ఎన్నో ఉన్నాయనే విషయం తనకు తెలుసునని చెప్పారు. ప్రతి కుటుంబం కలలు ఎలా నెరవేర్చాలనేదే తన ఆకాంక్ష అని, అందుకే ఇది అభివృద్ధికి ట్రైలర్ మాత్రమేనని అన్నానని గుర్తుచేశారు. 2047 వికసిత్ భారత్ ప్రాజెక్ట్ పనులు రెండేండ్లుగా సాగుతున్నాయని, తాను తిరిగి ప్రధానిగా అధికార పగ్గాలు చేపడితే తొలి 100 రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలపై లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నానని చెప్పారు.
రాబోయే 25 ఏండ్లలో భారత్ను ఎలా చూడాలనుకుంటున్నారని తాను 15 లక్షల మందికి పైగా వివిధ వర్గాల ప్రజల నుంచి సలహాలు స్వీకరించానని వివరించారు. ఆపై తాను ఏఐ సాయంతో అంశాల వారీగా వాటిని వర్గీకరించానని ప్రధాని తెలిపారు. దీనిపై పనిచేసేందుకు ప్రతి విభాగంలో అధికారులతో కూడిన బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు.
Read More :
Viral video | పోలీస్ స్టేషన్ను డ్యాన్స్ క్లబ్గా మార్చిన కాంగ్రెస్ జెడ్పీటీసీ భర్త.. వీడియో వైరల్