గురుద్వారాలో ప్రధాని మోదీ ప్రార్థనలు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం ఆకస్మికంగా ఢిల్లీలోని గురుద్వారా రకబ్ గంజ్ సాహిబ్కు వెళ్లారు. తన షెడ్యూల్లో లేకపోయినా అప్పటికప్పుడు మోదీ గురుద్వారాకు వెళ్లడం ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా గురు తేజ్ బహదూర్కు మోదీ నివాళులర్పించారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ పంజాబ్, హర్యానా రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో మోదీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. తేజ్ బహదూర్కు నివాళులర్పిస్తూ.. ఆయన జీవితం ధైర్యసాహసాలు, దయాగుణాల కలయిక అని మోదీ ప్రశంసించారు. తేజ్ బహదూర్ షహీదీ దివస్ సందర్భంగా ఆయనకు శిరస్సు వంచి వందనం చేస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. అయితే మోదీ గురుద్వారా పర్యటన సందర్భంగా ఎలాంటి పోలీసు బందోబస్తుగానీ, సాధారణ ట్రాఫిక్ను నిలిపేయడంగానీ చేయకపోవడం విశేషం. గురు తేజ్ బహదూర్ సిక్కుల 9వ గురువు.
This morning, I prayed at the historic Gurudwara Rakab Ganj Sahib, where the pious body of Sri Guru Teg Bahadur Ji was cremated. I felt extremely blessed. I, like millions around the world, am deeply inspired by the kindnesses of Sri Guru Teg Bahadur Ji. pic.twitter.com/ECveWV9JjR
— Narendra Modi (@narendramodi) December 20, 2020
తాజావార్తలు
- ఆంబోతుల ఫైట్.. పంతం నీదా..? నాదా..?
- పోలీసు మానవత్వం.. మూగజీవాన్ని కాపాడాడు..
- ప్రముఖ టిక్ టాక్ స్టార్ ఆత్మహత్య.. నెల్లూరు టౌన్లో కలకలం
- తెలంగాణ కశ్మీరం @ ఆదిలాబాద్
- అనుకోకుండా కలిసిన 'గ్యాంగ్ లీడర్' బ్రదర్స్
- హైదరాబాద్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
- లాఠీ వదిలి క్రికెట్ బ్యాట్ పట్టిన సీపీ
- 15 గంటలపాటు సాగిన భారత్-చైనా మిలటరీ చర్చలు
- బిగ్ బాస్ ఎఫెక్ట్.. హారికకు వరుస ఆఫర్స్
- ఐటీలో ఆదా ఇలా.. ఆ మినహాయింపులేంటో తెలుసా?