కరోనా విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ మరోమారు ప్రజల్ని హెచ్చరించారు. కరోనా పూర్తిగా నయం అవ్వలేదని, తన రూపాన్ని మార్చుకుంటోందని అన్నారు. కావున ప్రజలందరూ అప్రమత్తంగా వుండాలని ఆయన హెచ్చరించారు. మళ్లీ కొత్త కొత్త రూపంతో కరోనా ఎప్పుడు విజృంభిస్తో ఎవ్వరికీ తెలియడం లేదని తెలిపారు. ప్రజల మద్దతుతో ఇప్పటికే వ్యాక్సినేషన్ ఓ కొలిక్కి వచ్చిందని తెలిపారు.
గుజరాత్లోని మా ఉమియా ధామ్ భక్తులనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… మోదీ పై వ్యాఖ్యలు చేశారు. కరోనా అనేది పెద్ద సంక్షోభం. అందరూ సంక్షోభం ముగిసిందని అనుకుంటున్నారు. అది గ్యాప్ తీసుకుంది అంతే. మళ్లీ ఎప్పుడు రూపాంతం చెంది, బయటికి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఇది బహుముఖీనమైన రోగం. ప్రజల మద్దతుంటే దీని నుంచి బయటపడగలం అని మోదీ వ్యాఖ్యానించారు .