న్యూఢిల్లీ: బీజేపీ మెజారిటీ ఈసారి 400 కంటే ఎక్కువ ఉంటుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. రాజ్యసభలో ఆయన చేసిన ఈ వ్యాఖలపై ప్రధాని మోదీతోపాటు బీజేపీ ఎంపీలు నవ్వుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం రాజ్యసభలో మాట్లాడారు. ‘మీకు (బీజేపీ) 330-334 సీట్ల మెజారిటీ ఉంది. ఈసారి అది 400 కంటే ఎక్కువ ఉంటుంది’ అని అన్నారు. ఇది వాస్తవమేనని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమర్థించారు.
కాగా, రాజ్యసభ చైర్మన్తోపాటు ట్రెజరీ బెంచ్లో కూర్చొన్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు దీనికి తెగ నవ్వుకున్నారు. ఈ వీడియో క్లిప్ను ఎక్స్లో బీజేపీ పోస్ట్ చేసింది. ‘నాకు కొత్త ద్వేషులు కావాలి. పాత వారు నా అభిమానులుగా మారారు’ అన్నట్లుగా ప్రధాని మోదీ ఉంటారని బీజేపీ అందులో పేర్కొంది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
PM Modi be like, "I need new haters, the old ones have become my fans…" pic.twitter.com/dnpc5e0vI9
— BJP (@BJP4India) February 2, 2024