PM Modi : అయోధ్యలో అత్యంత వైభవంగా ప్రారంభమైన రామ మందిర అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మన్ కీ బాత్లో ప్రస్తావించారు. మందిరం దేశ ప్రజలను ఎలా ఐక్యం చేసిందనే విషయాన్ని ఆయన హైలైట్ చేశారు. శ్రీరాముడి పాలన మన రాజ్యాంగ నిర్మాతలకు స్ఫూర్తిగా నిలిచిందని గుర్తుచేశారు. లోతైన చర్చలతో రూపొందించబడిన భారత రాజ్యాంగంలోని మూడవ అధ్యాయంలో, భారత పౌరుల ప్రాథమిక హక్కులను వివరించడం జరిగిందని ప్రధాని చెప్పారు.
ఈ క్రమంలో మన రాజ్యాంగ నిర్మాతలు శ్రీరాముడు, సీత, లక్ష్మణులను వర్ణిస్తూ ఆయా చిత్రాలను అధ్యాయ ప్రారంభంలో ఉంచడం ఆసక్తికరమని అన్నారు. అయోధ్యలో రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం దేశం పౌరులను ఏకం చేసిందని చెప్పారు. దేశ ప్రజల మనోభావాలు ఒకేలా ఉన్నాయని, ప్రతి ఒక్కరి హృదయంలో రాముడు ఉన్నాడని చాటిచెప్పారని పేర్కొన్నారు.
ఈ సమయంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని ప్రజలు రామ భజనలు చేశారని, 22న సాయంత్రం దేశమంతటా రామ్ జ్యోతి వెలిగించి దీపావళి జరుపుకున్నారని గుర్తుచేశారు. ఇక ఈనెలలో జరిగిన రామాలయ ప్రారంభం, రిపబ్లిక్ డే పరేడ్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్, పద్మా అవార్డ్స్ వంటి కీలక అంశాలను మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు.
Read More :