రాజ్యసభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ పార్లమెంట్ను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. ఎంత సేపూ కాంగ్రెస్నే విమర్శించారని, తాము అడిగిన ప్రశ్నలకు సమాధానమే ఇవ్వలేది మండిపడ్డారు. తాము నిరుద్యోగం, కోవిడ్, చైనా వ్యవహారం, పెగాసస్ అంశాలను లేవనెత్తితే.. వేటికీ సమాధానం చెప్పలేదన్నారు. తాను ప్రధాని హోదాలో ఉన్నానన్న విషయాన్నే మరిచి వ్యవహరిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ను విమర్శించడంతో పాటు.. నెహ్రూ, ఇందిర, గాంధీలను కూడా విమర్శించారని, ఈ పని సభ బయట కూడా చేయవచ్చని చురకలంటించారు. తాము అడిగిన అంశాలకు జవాబివ్వకుండా.. పార్లమెంట్ను ఎన్నికల ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఖర్గే మండిపడ్డారు.