న్యూఢిల్లీ: దేశ ప్రజలందరికీ ప్రధాని మోదీ (PM Modi) గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు మనం మన అద్భుతమైన గణతంత్ర వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రాజ్యాంగాన్ని రూపొందించడం ద్వారా మన అభివృద్ధి ప్రయాణం ప్రజాస్వామ్యం, గౌరవంతోపాటు ఐక్యతగా దేశ అభివృద్ధి ప్రయాణం సాగేలా మార్గాన్ని రూపొందించిన మహనీయులందరికీ నివాళులర్పిస్తున్నా. ఈ వేడుక మన రాజ్యాంగ విలువలను కాపాడుతుందని, బలమైన, సంపన్నమైన దేశాన్ని నిర్మించే దిశగా మన ప్రయత్నాలను బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నా అంటూ ఎక్స్ వేదిగా పోస్ట్ చేశారు.
76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాయకత్వంలో న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్లో రిపబ్లిక్ డే కార్యక్రమం ప్రారంభమైంది.
Happy Republic Day.
Today, we celebrate 75 glorious years of being a Republic. We bow to all the great women and men who made our Constitution and ensured that our journey is rooted in democracy, dignity and unity. May this occasion strengthen our efforts towards preserving the…
— Narendra Modi (@narendramodi) January 26, 2025