లక్నో: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం కింద ఇవాళ ప్రధాని మోదీ సుమారు 75 వేల మంది లబ్ధిదారులకు ఇండ్లను అందజేశారు. ఉత్తరప్రదేశ్లోని 75 జిల్లాల్లో ఉన్న లబ్ధిదారులకు డిజిటల్ రూపంలో ఇంటి తాళాలను అందించారు. ఆ తర్వాత వర్చువల్ రీతిలో ఆయన ఆ స్కీమ్ లబ్ధిదారులతో మాట్లాడారు. లక్నోలోని ఇందిరా గాంధీ ప్రతిష్టాన్లో ట్రాన్స్ఫార్మింగ్ అర్బన్ ల్యాండ్స్కేప్ ఎక్స్పో నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, యూపీ సీం యోగి ఆదిత్యనాథ్లు పాల్గొన్నారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 17.3 లక్షల ఇండ్లను మంజూరీ చేశారు. ఇప్పటి వరకు 8.8 లక్షల మంది లబ్ధిదారులకు ఇండ్లను అందజేసినట్లు కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ తెలిపారు. లక్నోలో అర్బన్ సదస్సును నిర్వహించడం ఈ నగరానికి వన్నె తెచ్చినట్లు అవుతుందని మంత్రి రాజ్నాథ్ తెలిపారు. ఇండియాను కొత్తగా చూడాలన్న కల ప్రధానికి ఉందని, దాని కోసం ఆయన నిరంతరంగా శ్రమిస్తున్నారని, భారత్ కూడా ఆయన ఆశించిన మార్పును గమనిస్తున్నట్లు రాజ్నాథ్ వెల్లడించారు.