PM Modi | గుజరాత్ (Gujarat) రాష్ట్రంలో బ్రిడ్జి కూలిన ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) కింద బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతి చెందిన ఒక్కో బాధిత కుటుంబానికి రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు పెట్టారు.
వడోదర (Vadodara) జిల్లాలోని మహిసాగర్ నది (Mahisagar river)పై ఉన్న గంభీర్ వంతెన (Gambhira bridge) బుధవారం ఉదయం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది (Bridge Collapses). దీంతో పలు వాహనాలు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్లోని వడోదర-ఆనంద్ పట్టణాలను కలుపుతున్న ఈ వంతెనను 45 ఏళ్ల క్రితం నిర్మించారు.
అయితే, చాలా కాలంగా ఈ వంతెన శిథిలావస్థకు చేరినట్లు స్థానికులు తెలిపారు. తాజా ఘటనతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. మరోవైపు ప్రమాద స్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నదిలో పడిన వాహనాలను తొలగించడానికి వడోదర అగ్నిమాపక శాఖ బృందాలు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలు (NDRF) చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
The loss of lives due to the collapse of a bridge in Vadodara district, Gujarat, is deeply saddening. Condolences to those who have lost their loved ones. May the injured recover soon.
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The…
— PMO India (@PMOIndia) July 9, 2025
Also Read..
KTR | బీజేపీ డబుల్ ఇంజిన్ మోడల్ మరోసారి బట్టబయలు : కేటీఆర్
Bridge Collapses | వంతెన కూలిన ఘటనలో తొమ్మిది మంది మృతి
Bridge Collapses | కూలిన బ్రిడ్జి.. నదిలో పడిపోయిన వాహనాలు.. ముగ్గురు మృతి.. VIDEO