Lok Sabha Elections | సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections) ఐదో దశ పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు సైతం ఉదయమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటల వరకూ 10.28 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
పశ్చిమబెంగాల్లో అత్యధికంగా 15.35 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు చెప్పారు. ఇక బీహార్లో 8.86 శాతం, జమ్మూ కశ్మీర్లో 7.63 శాతం, జార్ఖండ్లో 11.68 శాతం, లఢక్లో 10.51 శాతం, మహారాష్ట్రలో 6.33 శాతం, ఒడిశాలో 6.87 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతోంది.
#LokSabhaElections2024 | 10.28% voter turnout recorded till 9 am, in the fifth phase of elections.
Bihar 8.86%
Jammu & Kashmir 7.63%
Jharkhand 11.68%
Ladakh 10.51%
Maharashtra 6.33%
Odisha 6.87%
West Bengal 15.35% pic.twitter.com/bNP5RqOg7d— ANI (@ANI) May 20, 2024
Also Read..
Lok Sabha Elections | తొలిసారి ఓటేసిన 56 ఏళ్ల అక్షయ్ కుమార్.. కొనసాగుతున్న పోలింగ్
Smriti Irani | అమేథిలో ఓటేసిన స్మృతి ఇరానీ
Yadadri | యాదాద్రిలో నృసింహ స్వామి జయంత్యోత్సవాలు ప్రారంభం..