హైదరాబాద్ : పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 37 పైసలు, డీజిల్పై 38 పైసలు పెంచారు. దీంతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.37 కాగా, డీజిల్ ధర రూ. 102.42గా ఉంది. పెట్రోల్ ధరలు అమాంతం పెరిగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
అక్టోబర్ 12, 13 తేదీల్లో పెట్రోల్ ధరలు పెంచలేదు. అంతకు ముందు వారం రోజుల పాటు వరుసగా పెట్రోల్ ధర పెరిగాయి. మళ్లీ ఇప్పుడు రెండు రోజుల నుంచి పెట్రోల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. నిన్న ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110గా ఉన్నది. అన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100పైనే ఉన్నది.