హైదరాబాద్: పెట్రో ధరల మంట కొనసాగుతున్నది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వరుసగా ఐదో రోజూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. దీంతో హైదరాబాద్లో లీటర్ పెట్రోలుపై 31 పైసలు, డీజిల్పై 38 పైసల చొప్పున పెరిగాయి. తాజా పెంపుతో లీటరు పెట్రోల్ ధర రూ.108.02కు చేరగాగ, డీజిల్ ధర రూ.100.82కి పరిగింది.
ఇంధన ధరల పెంపుపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. చమురుపై పరోక్ష పన్నులను విపరీతంగా పెంచడంవల్ల ద్రవ్యోల్బణంపై దుష్ప్రభావం పడుతుందన్నారు. పరోక్ష పన్నుల్ని తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణంపై ఒత్తిడిని తగ్గించవచ్చని సూచనప్రాయంగా తెలిపారు. అయితే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని స్పష్టం చేశారు.