లక్నో : ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖీరీ జిల్లాలో నిన్న నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపైకి కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడి కారు దూసుకెళ్లడంతో నలుగురు రైతులు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తామని ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ భగేల్, పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్జిందర్ ఎస్ రాంధావా ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. లక్నో ఎయిర్పోర్టులో వారిద్దరిని ల్యాండ్ అయ్యేందుకు అనుమతించొద్దని యూపీ అడిషనల్ చీఫ్ సెక్రటరీ అవనిష్ అవస్థి ఎయిర్పోర్టు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. సీతాపూర్ వద్ద ప్రియాంక గాంధీ వాద్రాను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే.