భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (Madhya Pradesh Polls) పోలింగ్ కొనసాగుతుండగా పోలింగ్కు ముందు రాజ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నేతల వాహనాలను కొందరు ధ్వంసం చేశారు. పార్క్ చేసిన బీజేపీ నేతల వాహనాలను కొందరు వ్యక్తులు రాళ్లు, కర్రలతో కొడుతున్న వీడియోలు వైరల్గా మారాయి.
కాంగ్రెస్ కార్పొరేటర్ సల్మాన్ ఖాన్ మృతి పట్ల కోపోద్రిక్తులైన ఆ పార్టీ కార్యకర్తలు ఈ దాడికి తెగబడ్డారు. కాంగ్రెస్ అభ్యర్ధి విక్రం సింగ్ నతిరజా వెంట సల్మాన్ ఖాన్ ఉండగా బీజేపీ అభ్యర్ధి అర్వింద్ పటెరియా, ఆయన అనుచరుల వాహనాలు ఢీ కొనడంతో కలకలం రేపింది. రాజ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఈ ఘటన వెలుగుచూసింది.
మధ్యప్రదేశ్లో మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుండగా ఈ ఘటన జరగడం కలకలం రేపింది. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 2533 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. మధ్యాహ్నం 1 గంట వరకు సుమారు 45 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడగా డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More :
CM KCR | మతం పేరిట పంచాయితీలా..? కరీంనగర్ ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పాలి : సీఎం కేసీఆర్