సోహ్నా, సెప్టెంబర్ 16: దేశంలో మంచి రోడ్లు కావాలంటే ప్రజలు డబ్బులు చెల్లించాల్సిందేనని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్గడ్కరీ చెప్పారు. హర్యానాలోని సోహ్నాలో గురువారం ఆయన ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ వే పురోగతిపై సమీక్షించారు. ‘ఎక్స్ప్రెస్ వే’ల వల్ల ప్రయాణ సమయంతోపాటు ఇంధన వ్యయం కూడా తగ్గుతుందని అన్నారు. ఎక్స్ప్రెస్ వే వెంట భూములు ఉన్న రైతులు వాటిని డెవలపర్లకు అమ్ముకోవద్దని, వారితో భాగస్వాములై వసతులు మెరుగుపర్చుకోవాలని సూచించారు. ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ వే ప్రయాణ సమమాన్ని 12 గంటలు తగ్గిస్తుందని తెలిపారు.