Modi Meeting | బెంగళూరు, మే 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర్ణాటకలో ప్రధాని మోదీ సభలకు జనం ముఖం చాటేస్తున్నారు. బీజేపీ డబ్బులిచ్చి మరీ ప్రజలను బహిరంగ సభలకు తరలించాల్సిన పరిస్థితి నెలకొన్నది. గత శనివారం బెళగావి జిల్లా కుడచిలో జరిగిన మోదీ సభకు జనాలను తరలించేందుకు బీజేపీ అభ్యర్థి రాజీవ్ అనుచరులు డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయారు.
దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు హారోగెరి పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ నేతలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని అధికారి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.