కొందరు తనకు ఆఫర్ చేశారన్న
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే
బెళగావి, మే 6: రూ.2,500 కోట్లు ఇస్తే, తనను కర్ణాటక సీఎంగా చేస్తానని ఢిల్లీకి చెందిన కొందరు తనకు ఆఫర్ ఇచ్చారని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయంపై తనను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా నివాసానికి తీసుకువెళ్తామని వాళ్లు చెప్పినట్టు పేర్కొన్నారు.
శుక్రవారం బెళగావిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఇలాంటి నకిలీ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అయితే, ఈ ఆఫర్ ఎవరు ఇచ్చారన్న విషయాన్ని వెల్లడించలేదు. యత్నాల్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ స్పందించారు. ఈ విషయంపై దర్యాప్తునకు డిమాండ్ చేశారు. దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరుగాల్సిన అవసరమున్నదని పేర్కొన్నారు.