ముంబై: ముంబై నుంచి శనివారం ఉదయం టేకాఫ్కు సిద్ధమైన ఎయిర్ మారిషస్కు చెందిన ఎంకే 479 విమానం ఇంజిన్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో ఐదు గంటల పాటు దాన్ని నిలిపివేశారు. ఏసీలు పనిచేయకపోవడంతో గాలి అందక అందులోని ప్రయాణికులు పలు ఇబ్బందులు పడ్డారు.
విమానంలో ఉన్న పిల్లలు, 78 ఏండ్ల బనూదత్ బూలాకి అనే మహిళ శ్వాస సంబంధ సమస్యలు ఎదుర్కొన్నారు. ఇంత ఇబ్బందిపడినా తాము కిందకు దిగడానికి సిబ్బంది అంగీకరించ లేదని ప్రయాణికులు ఆరోపించారు. ఆ తర్వాత కూడా సాంకేతిక సమస్య పరిష్కారం కాకపోవడంతో విమానాన్ని రద్దు చేస్తున్నట్టు ఎయిర్లైన్స్ నిర్వాహకులు తాపీగా ప్రకటించారు.