న్యూఢిల్లీ, డిసెంబర్ 23: పార్లమెంటు శీతాకాల సమావేశాలు షెడ్యూల్ కంటే ఆరురోజుల ముందుగానే ముగిశాయి. శుక్రవారం ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సమావేశాల్లో లోక్సభ మొత్తం 13 రోజులు సమావేశమైందని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. రాజ్యసభ సైతం 13 సార్లు జరిగిందని, 64 గంటల 50 నిమిషాల పాటు సభను నిర్వహించినట్లు రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్కర్ ప్రకటించారు.
షెడ్యూల్ ప్రకారం శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7న ప్రారంభమై 29న ముగియాలి. కానీ, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఆరు రోజుల ముందుగానే ముగించారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలోనే అరుణాచల్ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో చైనా బలగాలు చొరబాటుకు యత్నించిన సంఘటన జరిగింది. ఈ అం శంపై చర్చ జరపాలని ఉభయ సభల్లో ప్రతిపక్షాలు పట్టుబడిన విషయం తెలిసిందే. షెడ్యూల్కంటే ముందే సమావేశాలు ముగియడం వరుసగా ఎనిమిదోసారి.