Leopard | అడవిలో ఉండాల్సిన వన్య ప్రాణులు, క్రూర జంతువులు ఇటీవలే కాలంలో జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. అటవీ సమీప ప్రాంతాల్లోని గ్రామాల్లోకి వచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో చిరుతపులి (Leopard) కలకలం సృష్టించింది.
ఢిల్లీ (Delhi)లోని బురారీ (Burari) ప్రాంతంలో సోమవారం ఉదయం ఓ చిరుత పులి కలకలం రేపింది. నివాస ప్రాంతంలోకి ప్రవేశించిన ఈ క్రూర జంతువు ఇళ్ల కప్పులపై (residential area) దూకుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. ఐదుగురిపై దాడి చేసి గాయపరిచింది. దీంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ సిబ్బంది అక్కడికి చేరుకొని చిరుత దాడిలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం స్థానికుల సాయంతో చిరుతను ఓ గదిలో బంధించారు. మరోవైపు ఇళ్లపై చిరుత దూకుతూ పరుగులు తీస్తున్న దృశ్యాలను స్థానికులు తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Also Read..
SS Rajamouli | స్టేజ్పై భార్య రమాతో కలిసి రాజమౌళి డ్యాన్స్.. వీడియో వైరల్
LPG cylinder | వినియోగదారులకు గుడ్న్యూస్.. తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర
Libya PM | లిబియా ప్రధాని నివాసంపై గ్రనేడ్ దాడి