Libya PM | శాంతిభద్రతలకు తోడు అస్థిర ప్రభుత్వాలు, సంక్షోభం వంటి సమస్యలతో సతమతమవుతున్న లిబియా దేశంలో తాజాగా జరిగిన ఓ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఆ దేశ ప్రధాని (Libya PM) అబ్దుల్ హమీద్ అల్ దబేజా (Abdulhamid al-Dbeibah) నివాసంపై ఆదివారం రాకెట్ గ్రనేడ్ దాడి (rocket-propelled grenades) జరిగింది.
ఈ ఘటనలో భవనం స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని ఆ దేశ మంత్రి (Libyan minister) ఒకరు తెలిపినట్లు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. ప్రధాని ఇంటికి సమీపంలో పెద్ద ఎత్తున పేలుడు శబ్దాలు వినిపించినట్లు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు చెప్పినట్లు పేర్కొంది. మరోవైపు పేలుడు ఘటనతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ప్రధాని నివాసం వద్ద భారీగా మోహరించాయి.
2011 నుంచి లిబియాలో రాజకీయంగా అస్థిర పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. పాలన కూడా రెండు వర్గాల చేతుల్లో ఉంది. 2014లో తూర్పు, పశ్చిమ ప్రాంతాలగా విడిపోయిన వర్గాలు ఎవరికి వారే సొంతంగా పాలన కొనసాగిస్తున్నాయి. సమస్యను చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన ఐక్యరాజ్యసమితి 2021లో అబ్దుల్ హమీద్ నేతృత్వంలో నేషనల్ యూనిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, తూర్పు ప్రాంతంలోని పార్లమెంట్ ఆయనను అధికారికంగా గుర్తించేందుకు నిరాకరించకపోవడంతో అస్థిరత కొనసాగుతోంది.
Also Read..
LPG cylinder | వినియోగదారులకు గుడ్న్యూస్.. తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర
SS Rajamouli | స్టేజ్పై భార్య రమాతో కలిసి రాజమౌళి డ్యాన్స్.. వీడియో వైరల్
Kurchi Madathapetti | టెక్సాస్ ఈవెంట్లో కుర్చీమడతపెట్టి మేనియా.. ట్రెండింగ్లో వీడియో