AIADMK Manifesto : రానున్న లోక్సభ ఎన్నికలకు ఏఐఏడీఎంకే మేనిఫెస్టోను తమిళనాడు మాజీ సీఎం కే. పళనిస్వామి శుక్రవారం విడుదల చేశారు. రాష్ట్రాల గవర్నర్ల నియామకంలో సీఎంలను సంప్రదించాలని కేంద్రాన్ని కోరతామని మేనిఫెస్టోలో ఏఐఏడీఎంకే పేర్కొంది.
నీట్ పరీక్ష రద్దు చేస్తామని, కర్ణాటకకు చెందిన మేకేదాటు బహుళార్థ సాధక ప్రాజెక్టును ఆపేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని పార్టీ హామీ ఇచ్చింది. ప్రతి కుటుంబంలో మహిళకు నెలకు రూ. 3000 నగదు అందచేస్తామని హామీ ఇచ్చింది. కావేరి-గుందర్-వైగై, గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టులను పునరుద్ధరిస్తామని తెలిపింది.
చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. భారత్లో శరణార్ధులుగా నివసిస్తున్న శ్రీలంక తమిళులకు ద్వంద పౌరసత్వం కల్పిస్తామని వాగ్ధానం చేసింది. కాగా తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ఇటీవల ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలోనూ దాదాపు ఇవే హామీలు గుప్పించారు.
Read More :
Sharmistha Mukherjee | కర్మ ఫలితం వెంటాడింది : కేజ్రీవాల్ అరెస్ట్పై శర్మిష్ట ముఖర్జీ