Sharmistha Mukherjee : లిక్కర్ స్కామ్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్పై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ స్పందించారు. కేజ్రీవాత్ గతంలో చేసిన పనులకు సంబంధించిన పరిణామాలను ఎదుర్కొంటున్నారని ఆయనను కర్మ వెంటాడిందని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ గతంలో ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ సహా కాంగ్రెస్ నేతలపై నిరాధార, బాధ్యతారాహిత్య ఆరోపణలు చేశారని శర్మిష్ట గుర్తుచేశారు.
ఎక్స్ వేదికగా కేజ్రీవాల్ తీరును ఆమె తప్పుపట్టారు. కర్మ అనుసరించిందని ఆ పోస్ట్లో శర్మిష్ట పేర్కొంటూ కేజ్రీవాల్ గతంలో చేసిన చర్యలే ఆయనను వెంటాడుతున్నాయని రాసుకొచ్చారు. కేజ్రీవాల్తో పాటు అన్నా హజారే బృందం గతంలో షీలా దీక్షిత్ సహా కాంగ్రెస్ నేతలపై నిరాధార, బాధ్యతారాహిత్య ఆరోపణలు చేశారని, షీలా దీక్షిత్పై ఎన్నో ఆధారాలున్నాయని కేజ్రీవాల్ పేర్కొన్నారని ఆమె గుర్తుచేశారు.
అయితే ఆ ఆధారాలను ఇప్పటివరకూ ఎవరూ చూడలేదని, కానీ కర్మ ఫలితం అనుభవించాలని ఎక్స్ వేదికగా శర్మిష్ట పోస్ట్ చేశారు. ఇక ఎక్సైజ్ స్కామ్లో కేజ్రీవాల్ను అంతకుముందు ఈడీ అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ అరెస్ట్ అనంతరం ఆప్కు కాంగ్రెస్ బాసటగా నిలిచింది. రానున్న లోక్సభ ఎన్నికల ఫలితాలపై భయపడుతున్న బీజేపీ విపక్షాలకు అవరోధాలు కల్పించేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ దుయ్యబట్టింది.
Read More :
Bhagwant Mann | మీరు కేజ్రీవాల్ను అరెస్టు చేయగలరు.. ఆయన ఆలోచనను కాదు: పంజాబ్ సీఎం భగవంత్ మాన్