న్యూఢిల్లీ: మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను (Arvind Kejriwal) ఈడీ అరెస్టు చేయడాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagwant Mann) ఖండించారు. ‘మీరు కేజ్రీవాల్ను మాత్రమే అరెస్టు చేస్తారు. కానీ ఆయన ఆలోచనను బంధిస్తారు. కేజ్రీవాల్ ఒక వ్యక్తి కాదు.. ఆలోచనా విధానం. తామంతా ఆయనతోనే నిలబడతాం’ అంటూ ఎక్స్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
కాగా, నోటీసులు ఇస్తామంటూ ఢీల్లీ ముఖ్యమంత్రి ఇంటికి వచ్చిన ఈడీ అధికారులు.. తర్వాత సోదాలు నిర్వహించారు. విచారణ కోసం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాల్సిందిగా కేజ్రీవాల్కు అధికారులు సూచించారు. అందుకు ఆయన నిరాకరించారు. ఇంట్లోనే విచారించాలని కోరారు. కా సేపటి తర్వాత కేజ్రీవాల్ను అరెస్టు చేశారు. అక్రమ అరెస్టుకు నిరసనగా ఆమ్ఆద్మీ పార్టీ నేడు దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది.
“You will arrest Arvind Kejriwal but how will you arrest his thinking… Arvind Kejriwal is not a person but an idea and we stand with our leader like a rock…,” tweets Punjab CM and AAP leader Bhagwant Mann pic.twitter.com/r1QMmIkyBs
— ANI (@ANI) March 22, 2024