చెన్నై: అన్నాడీఎంకేపై పళనిస్వామి క్రమంగా పట్టుపెంచుకుంటున్నారు. పార్టీలో ద్వంద్వ నాయకత్వానికి మంగళం పలికిన సర్వసభ్య మండలి.. మరో సంచలన నిర్ణయం తీసుకున్నది. పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంపై బహిష్కరణ వేటు వేసింది. ప్రాథమిక సభ్యత్వం రద్దుచేయడంతోపాటు సహ కోశాధికారి పదవి నుంచి తొలగించింది. ఆయన మద్దతుదారులను కూడా పార్టీ నుంచి బహిష్కరించింది. వారి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దుచేసింది.
చెన్నైలో పళనిస్వామి ఆధ్వర్యంలో అన్నాడీఎంకే సర్వసభ్య మండలి సమావేశం జరుగుతున్నది. ఇందులో భాగంగా తొలుత ద్వంద్వ నాయకత్వాన్ని రద్దుచేసిన మండలి.. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని పునరుద్దరించాలని నిర్ణయించింది. మరో నాలుగు నెలల్లో ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు నిర్వహించాలని తీర్మానించింది. అప్పటివరకు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని ఎన్నుకున్నది.
#UPDATE | AIADMK passes a resolution to remove O Paneerselvam from party's primary membership at E Palaniswami-led General Council meeting in Vanagaram, Tamil Nadu pic.twitter.com/vigbNP32df
— ANI (@ANI) July 11, 2022
అయితే తనను బహిష్కరించడంపై పన్నీర్సెల్వం స్పందించారు. పార్టీ పళనిస్వామి సొత్తు కాదని, తనను పార్టీ నుంచి తొలగించే అధికారం ఎవరికీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి తానే కోశాధికారినని స్పష్టం చేశారు. తానే పళనిస్వామిని పార్టీ నుంచి తొలగిస్తున్నానని చెప్పారు.