కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సవాల్ విసిరారు. దమ్ముంటే హైదరాబాద్ లోక్సభ నుంచి బరిలోకి దిగాలని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో వయనాడ్ నుంచి కూడా ఓడిపోతారన్న విషయం తనకు తెలుసని ఒవైసీ ఎద్దేవా చేశారు.
టీఆర్ఎస్, బీజేపీతో సహా ఒవైసీని సవాల్ చేసేందుకే తాను తెలంగాణకు వచ్చానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పేర్కొనడంతో ఒవైసీ పై విధంగా స్పందించారు. హైదరాబాద్ నుంచి పోటీ చేసి, అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఒవైసీ చురకలంటించారు. హైదరాబాద్ కాదంటే.. మెదక్ నుంచి కూడా పోటీకి దిగొచ్చని ఒవైసీ పేర్కొన్నారు.