కోల్కతా: దేశంలో నెలకొన్న ఎల్పీజీ గ్యాస్ కొరతపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రజలకు తగినంత గ్యాస్ సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రస్తత గ్యాస్ సంక్షోభానికి ప్రధాని మోదీ బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు. సోమవారం కోల్కతాలో గ్యాస్ కొరతపై జరిగిన నిరసనకు మమతా బెనర్జీ నేతృత్వం వహించారు. ‘బెంగాల్ ప్రజల హక్కులు, గౌరవం’ కోసం ఐక్య సమీకరణగా ఈ నిరసన ర్యాలీ జరిగిందని తెలిపారు.
కాగా, ఎల్పీజీ సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వం కారణమని మమతా బెనర్జీ విమర్శించారు. పశ్చిమ ఆసియాలో సంఘర్షణ కారణంగా ఇంధన అంతరాయాల మధ్య ఆంక్షలు విధించే ముందు వంట గ్యాస్, పెట్రోలియం ఉత్పత్తుల నిల్వల అంశంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. గ్యాస్ కొరత సంక్షోభానికి ప్రధాని మోదీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
Also Read:
Bihar Congress MLAs Missing | రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో.. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మిస్సింగ్
minors rape girl | 8 ఏళ్ల బాలికపై.. ముగ్గురు బాలురు సామూహిక అత్యాచారం
Watch: బైక్ రేస్లో.. స్కూటీని ఢీకొట్టిన రాయల్ ఎన్ఫీల్డ్, విద్యార్థి మృతి