చండీగఢ్: సహజీవనం (లివ్ ఇన్ రిలేన్షిప్) పై పంజాబ్, హర్యానా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సహజీవనం అనే ఈ బంధం సామాజికంగా, నైతికంగా ఆమోదయోగ్యం కాదని స్పష్టంచేసింది. ప్రేమించుకుని ఇంటి నుంచి పారిపోయిన ఓ జంట తమకు రక్షణ కల్పించాలని కోరుతూ పంజాబ్, హర్యానా హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం సహజీనంపై పై వ్యాఖ్యలు చేసింది.
గుల్జా కుమారి (19), గురువిందర్ సింగ్ (22) పంజాబ్లోని తార్న్ తరన్ జిల్లాకు చెందిన వారు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే గుల్జాకుమారి తల్లిదండ్రులు వారి వివాహానికి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో వారు ఇండ్ల నుంచి పారిపోయి సహజీవనం చేస్తున్నారు. గుల్జాకుమారి తల్లిదండ్రుల నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ ఇటీవల వారు కోర్టును ఆశ్రయించారు.
వారి పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు.. ‘వాస్తవానికి పిటిషనర్లు ఇద్దరూ తమ లివ్ ఇన్ రిలేషన్ (సహజీవనం)కు ఆమోదముద్ర కోరుతున్నారు. కానీ సహజీవనం నైతికంగా, సామాజికంగా ఆమోదయోగ్యం కాదు’ అని జస్టిస్ హెచ్ఎస్ మదాన్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కొవిడ్పై యుద్ధం ప్రతి ప్రాణాన్ని కాపాడేలా ఉండాలి: ప్రధాని మోదీ