న్యూఢిల్లీ: విపక్ష పార్టీ ఎంపీ(Opposition MPs)లు ఇవాళ ఢిల్లీలో ర్యాలీ నిర్వహించాయి. రాష్ట్రపతి భవన్(Rastrapathi Bhavan)కు మార్చ్ చేపట్టాయి. విజయ్ చౌక్ నుంచి సాగిన ఎంపీల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. డెమోక్రసీ ఇన్ డేంజర్ అన్న బ్యానర్తో ఎంపీలు ప్రదర్శనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈ ప్రదర్శన సాగింది. అయితే మధ్యలోనే ఎంపీలను అరెస్టు చేసి బస్సులో తరలించారు. మార్చింగ్కు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. రాష్ట్రపతి ముర్ము(President Murmu) కూడా విపక్షాలను కలిసేందుకు టైమ్ ఇవ్వలేదని తెలుస్తోంది.
అదానీ సంక్షోభంపై హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా జేపీసీ(JPC)తో దర్యాప్తు చేపట్టాలని విపక్ష పార్టీలు పార్లమెంట్లో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశాన్ని రాష్ట్రపతి ముర్ముతోనూ చర్చించేందుకు విపక్షాలు ప్రయత్నించాయి. కానీ రాష్ట్రపతి ముర్ము విపక్షాలకు టైమ్ ఇవ్వలేదని తెలిసింది.