కోల్కతా: ప్రధాని నరేంద్రమోదీపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి మరోసారి నిప్పులు చెరిగారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ సభలో మాట్లాడిన ఆమె.. మోదీ హయాంలో దేశంలో పారిశ్రామిక ప్రగతి పూర్తిగా నిలిచిపోయిందని ఆరోపించారు.
దేశంలో ఏ పురోగతి లేదని, కేవలం ఆయన గడ్డం మాత్రమే పెరుగుతున్నదని మమతాబెనర్జీ ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి చలోక్తులు విసిరారు. ప్రధాని మోదీ కొన్నిసార్లు తనను తాను స్వామి వివేకానందగా చెప్పుకుంటారని ఆమె ఎద్దేవా చేశారు.
ఇటీవల ప్రధాని మోదీ క్రికెట్ స్టేడియానికి తన పేరు పెట్టుకున్నారని, మోదీ తీరు చూస్తుంటే ఆయన మెదడులో ఏదో తేడాలు ఉన్నట్లు అనిపిస్తున్నదని మమత అనుమానం వ్యక్తంచేశారు.
మోదీ వాలకం చూస్తుంటే ఆయన స్క్రూ లూజ్ అయిందేమో అనిపిస్తున్నదని మమతాబెనర్జి వ్యాఖ్యానించారు. అందుకే ఈ ఎన్నికల్లో ప్రజలు మరోసారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.