Delhi court | దేశరాజధాని ఢిల్లీ (Delhi court)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సాకేత్ కోర్టు (Saket Court)లో ఓ ఖైదీని (prisoner) సహచర ఖైదీలు దారుణంగా హత్య చేశారు. విచారణ కోసం తీహార్ జైలు (Tihar Jail) నుంచి ఖైదీలను పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. అక్కడ లాకప్లో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో ఇద్దరు ఖైదీలు తోటి ఖైదీపై దాడి చేసి గొంతుకోశారు.
లాకప్లోపల రెండు గ్రూపుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘర్షణలో అమన్ అనే ఖైదీ తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. అధికారులు వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అక్కడ మరణించినట్లు ప్రకటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను విచారిస్తున్నారు.
Also Read..
DK Shivakumar | తొక్కిసలాట.. మీడియా ముందు కన్నీటిపర్యంతమైన డీకే శివకుమార్
NIA | ఉగ్రవాదుల కోసం వేట.. జమ్ము ప్రాంతంలోని 32 ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారుల సోదాలు
Bengaluru Stampede | బెంగళూరు తొక్కిసలాట.. మృతులు వీళ్లే..