లక్నో : రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు గొప్ప కానుకను అందించనున్నది. మహిళలు ఏ బస్సులోనైనా, ఎప్పుడైనా ఉచితంగా ప్రయాణించేలా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఉత్తరప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. 21 ఆగస్ట్ అర్ధరాత్రి నుంచి 22 ఆగస్ట్ అర్ధరాత్రి 12 గంటల వరకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని తమ ఉత్తర్వుల్లో తెలిపింది. మహిళలు అన్ని రకాల బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చునని యూపీఎస్ఆర్టీసీ పేర్కొన్నది.
రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మహిళలకు రక్షాబంధన్ రోజున ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. ఆ రోజున రాష్ట్రంలోని మహిళలంతా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చునని తెలిపింది. గత సంవత్సరం కూడా దాదాపు 3.5 లక్షల మంది మహిళలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మిషన్ శక్తి మూడవ దశ కింద రక్షాబంధన్ పండుగకు ఒక రోజు ముందు సీఎం యోగి ఆదిత్యనాథ్ మహిళా పోలీసులను బీట్ పోలీస్ ఆఫీసర్లుగా పోస్ట్ చేసే బహుమతిని కూడా ఇవ్వనున్నారు. పింక్ టాయిలెట్ల నిర్మాణంతోపాటు రాష్ట్రంలోని దాదాపు 1300 పోలీస్ స్టేషన్లలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో మహిళా పోలీసుల నియామకం కూడా చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది.
నకిలీ వ్యాక్సిన్ల గుర్తింపు.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
ఈ చిన్నారి జిమ్నాస్టిక్స్.. అద్భుతం!
చట్టసభలకు అంతరాయం కలుగకుండా చూడాలి : వెంకయ్యనాయుడు
ఈ రోబోలు మనిషిలాగే దుంకుతాయి..!
ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా..? అయితే, ఇది మీ కోసమే..!
త్వరలో మళ్లీ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులు
ఆఫ్ఘాన్ను తాలిబాన్ ఆక్రమించుకోవడం సబబే: సజ్జాద్ నోమాని
ప్రాణాలకు తెగించి హక్కుల కోసం గళమెత్తారు..
నేతాజీ… గగన సిగలకెగసి కనుమరుగై పోయాడు..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..